నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన బండారు

తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి, ప్రముఖ నేత బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ… భోగి, మకర సంక్రాంతి మరియు కనుమ పండుగకు అందరికీ పేరుపేరునా శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. ప్రతి ఒక్కరూ అందరి ఇంట్లో సుఖ సంతోషాలతో, అందరి కుటుంబాలు వర్ధిల్లాలని, రాష్ట్ర ప్రజలు, తెలుగువారందరూ, నా నియోజకవర్గ ప్రజలు, జనసైనికులు, వీరమహిళలు, కార్యకర్తలు, అన్ని వర్గాల వారు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు, జిల్లా జనసేన రథసారథి కందుల దుర్గేష్, రాష్ట్ర అదినాయకుడు జనసేనాని, అధినేత పవన్ కళ్యాణ్, క్షేమంగా ఉంటూ, ఈ భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు జరుపుకోవాలని, కొత్తపేట నియోజకవర్గం జనసేన కుటుంబం తరుపున కోరుచున్నాను. నా నియోజకవర్గ ప్రజలు, రైతులందరూ పచ్చగా ఉండాలని, పాడి పంటలతో తులతూగాలని, రాబోయే రోజుల్లో ప్రకృతి సహకరించాలని, రైతు కష్టాలను, ప్రజల కష్టాలను భగవంతుడు తీర్చాలని కోరుచున్నాను. మా జనసేన కుటుంబంతో, మా అధినేత జనసేనాని ఆశయాలను, సేవా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్తామని, జనసైనికులు, వీరమహిళలు, నా కార్యకర్తలు అంతా ఐకమత్యంతో అన్ని వర్గాల వారిని, అన్ని కులాల వారిని కలుపుకుని, కష్టసుఖాలను పంచుకుంటూ, నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ ముందుకు సాగుతామని, ఈ సంక్రాంతి పండగ పర్వదినం సందర్భంగా అందరికీ మరొకసారి శుభాకాంక్షలు బండారు శ్రీనివాస్ తెలియజేశారు.