భీమిలి జనసేన ఆధ్వర్యంలో సరోజినీ నాయుడు జన్మదిన వేడుకలు

భీమిలి నియోజకవర్గం: భారత కోకిల, నైటింగేల్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన స్వాతంత్ర్య సమరయోధురాలు, భారతదేశపు తొలి మహిళా గవర్నరు సరోజినీ నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని భీమిలి ఇంచార్జి సందీప్ పంచకర్ల నాయకత్వాన్ని బలపరుస్తూ ఫిబ్రవరి 13వ తేదీ, సోమవారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో భీమిలి నియోజకవర్గం 7వార్డ్ వాంబే కాలనీ అంగన్వాడీ కేంద్రంలో సరోజినీ నాయుడు జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రంలో మౌలిక వసతులు లేక ఇబ్బంది పడుతున్న గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలకు, టీచర్లకు మరియు హెల్పర్స్ కి అవసరం అయిన సామాగ్రిని జనసేన నాయకులు ఒమ్మి దేవి యాదవ్, సాగర్ మల్ల, యాళ్ల విజయ్ కుమార్, ఆకుల శివ, యార్ణగుల సుధీర్, వావులపల్లి చిన్న, వెనుగాలా శ్రీను, రెడ్డి రాజు, పాలపర్తి గణేష్ అందజేసారు. అనంతరం స్థానికులకు జనసేన క్రియాశీల కార్యక్రమం యొక్క వివరాలు తెలియజేసి, జనసేనలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన జనసేన కుటుంబ సభ్యులందరికి ధన్యవాదములు తెలియజేసారు.