జనసేనాని చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సర్వేపల్లి జనసేన

సర్వేపల్లి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు అండగా ఐదు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది మరి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఎవరికీ రైతులను, రైతు కుటుంబాలను ఆదుకోవాలనే ఆలోచన రాకపోవడం చాలా దురదృష్టకరం. సర్వేపల్లి నియోజకవర్గం జనసేన నాయకులు బోబ్బేపల్లి సురేష్ బాబు అధ్యక్షతన తోటపల్లిగూడూరు మండలం నరుకూరు సెంటర్లో మా అధినేత, మా దైవం ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందుండే మహనీయమూర్తి పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు అధికార పక్షం ప్రతిపక్షం వారు కావచ్చు వారిని మేము ఒకటే అడుగుతున్నామని ఎవరైనా సరే రైతు కన్నీరు పెడితే రాష్ట్రానికి మంచిది కాదు కాబట్టి వారిని ఆదుకోవడమే లక్ష్యంగా అధినేత ఈరోజు ఏదో మా వంతు ఆ కుటుంబాలకి భరోసా ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు ఇస్తానని చెప్పడం మాకు చాలా ఆనందంగా ఉంది. అదే విధంగా గ్రామస్థాయి నియోజకవర్గ స్థాయిలో అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి మా వంతు కృషి చేస్తామని ఈ తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులను పట్టించుకునే పరిస్థితిలో లేదు ఈరోజు కౌలు రైతులు కావచ్చు చిన్న సన్నకారు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక చేసుకోలేక తట్టుకోలేక ఎంతో అవస్థలు పడే పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరిచి రైతులను ఆదుకోవాలని చెప్తే మేము కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తోటపల్లి గూడూరు మండల అధ్యక్షుడు సందీప్, పవన్ సుమంత్, సాయి, ప్రసాద్, షరీఫ్, శ్రీహరి, వంశీ, తదితరులు పాల్గొన్నారు.