జనసేన ఆధ్వర్యంలో సర్వేపల్లి జయంతి

విజయనగరం: జనసేన నేత గురాన అయ్యలు కార్యాలయంలో మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల్పించారు.
ఈ సందర్భంగా గురాన అయ్యలు మాట్లాడుతూ అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని పంచి క్రమశిక్షణ అలవర్చి జీవితాన్ని నడిపించే గురువులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయుడిగా, రాష్టప్రతిగా దేశానికి ఎనలేని కీర్తిని తీసుకువచ్చారని కొనియాడారు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ రాష్టప్రతిగా ఎదిగి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారన్నారు. అటువంటి మహనీయుని జయంతిని పురస్కరించుకుని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం ఉపాధ్యాయులకు గర్వకారణమన్నారు. విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని విద్యారంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జి.పుష్ప, ప్రవీణ, ఎమ్.పవన్ కుమార్, పిడుగు సతీష్, కె.సాయి. వజ్రపు ననీన్ కుమార్, కంది సురేష్, భార్గవ్, హిమంత్, కె.రాజు, శంకర్రావు, పైడినాయుడు తదితరులు పాల్గొన్నారు.