నరసరావుపేట జనసేన ఆధ్వర్యంలో సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి

నరసరావుపేట, జనసేన పార్టీ ఆధ్వర్యంలో లాల్ బహుదూర్ కూరగాయల మార్కెట్ సెంటర్లో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ జిలాని నాయకత్వంలో భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ 125 వ జయంతి మరియు మాతృమూర్తి భారతరత్న మదర్ థెరిస్సా 24వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించటం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ అధ్యాపకుడి నుండి భారత రాష్ట్రపతి వరకు ఎదిగిన గొప్ప తెలుగువాడు సర్వేపల్లి రాధాకృష్ణ అని, ఆయన జయంతిని దేశవ్యాప్తంగా టీచర్స్ డే గా జరుపుకుంటూ తమ బోధనలతో జాతి వికాసానికి పాటుపడుతున్న గురువులందరికీ గురుపూజోత్సవం సందర్భంగా వారిని స్మరించుకుంటూ జనసేన పార్టీ ప్రతి కార్యకర్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, మాతృమూర్తి మదర్ థెరిస్సా ఆశయాలను ఆచరణలో పాటిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి అద్దేపల్లి ఆనంద్ బాబు, మండల అధ్యక్షులు కృష్ణంశెట్టి గోవిందు, ఆర్కే యాదవ్, గుప్తా శ్రీకాంత్, షేక్ నాగుల్ మీరా, మిరియాల సోము, వల్లంశెట్టి శ్రీను, ఎస్.డి.గౌస్, ఉల్లి చంటి, పోతంశెట్టి రాము, జేష్ట మల్లి, బీమా సాంబయ్య, యలమల కొండ, కొవ్వూరు నరసింహారావు, చెన్నుపల్లి సాంబ తదితరులు పాల్గొన్నారు.