రైతు భరోసా యాత్రకు.. నేను సైతం అంటూ తలాటం సత్య లక్ష విరాళం

రాష్ట్రంలో కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ చేపడుతున్న కౌలు రైతు భరోసా యాత్రకు ప్రజల నుండి భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సొంత సొమ్మును కౌలు రైతులకు విరాళంగా ఇస్తూ.. చాలామంది యువకులకు మార్గదర్శకులగా నిలవడంతో.. జన సైనికులు పవన్ కళ్యాణ్ చేస్తున్న మహా యజ్ఞానికి నేను సైతం అంటూ ముందుకు కదలడంతో యాత్ర మరింత ఆకర్షణీయంగా మారింది. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ కు కాకినాడ సిటీ ఇంచార్జ్ ముత్తా శశిధర్, రూరల్ నియోజవర్గ ఇన్ఛార్జ్ పంతం నానాజిల చేతులమీదుగా జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య కౌలు రైతు భరోసా యాత్రకు రూ. లక్ష విరాళం అందించారు.