జనవరి 18 నుంచి ఏపీలో తెరుచుకోనున్న స్కూళ్లు..

రాష్టంలో కోవిడ్-19 కారణంగా 10 నెలల పాటు స్కూళ్లు మూతపడ్డాయి. కరోనా కారణంగా గతేడాది విద్యాసంవత్సరం చాలా వరకు రద్దు అయ్యింది. ఆన్లైన్ ద్వారానే విద్యార్థులు క్లాసులకు హాజరవుతున్నారు. 7 నుంచి 10 తరగతి విద్యార్థులకు మాత్రమే స్కూల్ కు వెళ్లే అవకాశం ఉన్నది. ఒక పూట మాత్రమే స్కూల్ నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే, కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో జనవరి 18 నుంచి విద్యార్థులకు ఒక్కపూట కాకుండా రెండుపూటలా స్కూల్ నిర్వహించేలా ఏర్పాటు చేయాలని చూస్తున్నది. పదోతరగతి పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. అయితే, 1 నుంచి 5 తరగతి విద్యార్థులకు సంబంధించిన విషయంపై విద్యాశాఖ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక జనవరి 18 వ తేదీ నుంచి 6, ఇంటర్ ఫస్ట్ ఇయర్ తరగతులు ప్రారంభం కాబోతున్నాయి.