వారాహికి శాస్త్రోక్తంగా పూజలు

కదం తొక్కుతూ పదం పాడుతూ వారాహి రథం కదన రంగంలోకి కదిలింది. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో రెండు రోజుల పాటు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టిన యాగం పూర్ణాహుతితో ముగిసిన అనంతరం వారాహికి ప్రత్యేక పూజలుగావించారు. వేద పండితులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి విజయం సిద్దించాలని ఆశీర్వచనం చేశారు. వారాహి రథం నాలుగు వైపులా గుమ్మడికాయలు కొట్టి, నీరు వార బోసి చివరిగా వారాహికి హారతినిచ్చి పవన్ కళ్యాణ్ గారు నమస్కరించారు. అనంతరం వారాహి బయలుదేరగా దాని ముందే పవన్ కళ్యాణ్ , జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విజయ సంకేతం చూపుతూ నడిచారు.