విద్యార్థినికి జనసేన ఐటీ విభాగం సభ్యుల ఆర్థిక చేయూత

నాగబాబు చేతుల మీదుగా రూ. 50 వేలు చెక్ అందజేత
నీట్ ప్రవేశ పరీక్షలో అత్యుత్తమ ర్యాంకుతో మెడిసిన్ సీట్ సాధించి సహాయం కోసం ఎదురు చూస్తున్న విద్యార్థిని గేదల సాయి భవానికి జనసేన ఐటీ విభాగం సభ్యులు ఆర్థిక సహాయం చేశారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కొణిదెల నాగబాబు చేతుల మీదుగా రూ. 50 వేలు చెక్ విద్యార్థినికి అందజేశారు. జనసేనలో క్రియాశీలకంగా వ్యవహరించే సాయి భవాని తండ్రి గేదల సత్యనారాయణ ఇటీవల కాలం చేయడంతో ఆ కుటుంబానికి అండగా నిలబడి ఆర్థిక సహాయం చేసిన జనసేన ఐ.టీ. విభాగం సభ్యులను నాగబాబు అభినందించారు. జనసేన ఐ.టీ. విభాగం చైర్మన్ మిరియాల శ్రీనివాస్, పెన్నమరెడ్డి నాగబాబు, సాధనాల దుర్గబాబు తదితరులు పాల్గొన్నారు.