తాడేపల్లిగూడెంలో సభను చూస్తే తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న వారికి వణుకు పుట్టాలి

  • జనసేన పార్టీ ప్రచార కమిటీ విజయవాడ అర్బన్ ప్రధాన కార్యదర్శి తిరుపతి సురేష్

విజయవాడ వెస్ట్: జనసేన టిడిపి ఉమ్మడి బహిరంగ సభను విజయవంతం చేయమని జనసేన పార్టీ ప్రచార కమిటీ విజయవాడ అర్బన్ ప్రధాన కార్యదర్శి తిరుపతి సురేష్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా దుతూ ముందుగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.. నన్ను ప్రచార కమిటీ విజయవాడ అర్బన్ ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు, మరియు 28-2-24 జరిగే జనసేన టిడిపి ఉమ్మడి బహిరంగ సభకు జనసైనికులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం నాయకులు, పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.
జనసేనాని మాటకి ఎంత కట్టుబడి ఉన్నారో రేపు సభకి వెళ్లే పశ్చిమ నియోజకవర్గం జనసైనికులు, మహిళలు, నాయకులు తెలియచేస్తారనిమీడియా ముఖంగా చెప్తున్నా
పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ గారి ఆధ్వర్యంలో బస్సులు, కార్లు సితార సెంటర్ వద్ద ఏర్పాటు చేస్తున్నాము జనసైనికులు, మహిళలు, నాయకులు పెద్ద ఎత్తున రావలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో కృష్ణా పెన్నా మహిళా అధ్యక్షులు మల్లెపు విజయలక్ష్మి, మొబీనా, రేష్మ, షబానా, లక్ష్మీ విజయ కుమారి, బొమ్ము రాంబాబు, జెల్లి రమేష్, సిగనం శెట్టి రాము, ఎం హనుమాన్ తదితరులు పాల్గొన్నారు.