వేలంపాటలో లడ్డును కైవసం చేసుకున్న శీలం వరబాబు

మైలవరం: చండ్రగూడెం శ్రీలక్ష్మీ నారాయణ స్వామి దేవస్థానం నందు ఏర్పాటుచేసిన శ్రీ విజయ గణపతి లడ్డు వేలం పాట గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ వేలం పాటలో 21 కేజీల స్వామివారి లడ్డును శీలం వరబాబు అను రోడ్ లైన్స్ అధినేత 60వేల రూపాయలకు సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ శాలువాతో సత్కరించి, మేళ తాళాలతో వారి స్వగృహమునకు వెళ్లి అప్పగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ స్వామి-గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.