ఏబిఎన్ విలేకరిపై దాడి సభ్యసమాజం తలదించుకునే ఘటన

  • గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త వాసగిరి మణికంఠ

గుంతకల్ నియోజకవర్గం: అనంత జిల్లా ఏబిఎన్ విలేఖరి కృష్ణపై దాడిని నిరసిస్తూ గుంతకల్ పట్టణంలో స్థానిక ఎమ్మార్వో కార్యాలయం దగ్గర ఆఫూవ్ఝ్ ఏ.పి.యు.డబల్ యు.జె ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త వాసగిరి మణికంఠ పాల్గొని వారికి సంఘీభావం తెలిపి, జనసేన పార్టీ తరఫున ఇది ఒక ప్రజాస్వామ్యం పై జరిగిన దాడిగా ముఖ్యంగా వైసిపి అల్లరి ముకలు చేసినటువంటి ఈ దాడి సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా ఉందని, సిద్ధం సిద్ధం అనే ముఖ్యమంత్రిని, ప్రజలు ఇంటికి పంపించేందుకు “సిద్ధంగా” ఉన్నారని ధ్వజమెత్తారు.