జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు

మైలవరం: ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ గ్రామ జనసేన పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు మైలవరం నియోజవర్గ ఇంచార్జ్ అక్కల రామ్మోహన్ గాంధీ మాట్లాడుతూ సమాజంలో చెడును అణిచివేసి మంచిని ఆదరించమని కోరారు. క్రైస్తవ సోదరులకు, సోదరీమణులకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పోలిశెట్టి తేజ, స్థానిక జనసేన పార్టీ నాయకులు కొమ్మూరి వెంకటస్వామి, అశోక్, హనుమంతరావు, బాల, ఆశీష్, శ్రీను, జనసేన కార్యకర్తలు మరియు స్థానికులు పాల్గొన్నారు.