శతఘ్ని న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన బొర్రా

సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీకి సంబంధించిన సమాచారాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచే శతఘ్ని న్యూస్ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్లను ఆదివారం సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగినది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శతఘ్ని న్యూస్ టీమ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ జనసేన పార్టీ పట్ల వారికి ఉన్న నిబద్ధత పట్టుదల చాలా విలువైనవి అని కొనియాడారు. జనసేన పార్టీకి సంబంధించిన పార్టీ కార్యక్రమాలను గ్రామస్థాయి నుండి ప్రజలకు అందజేస్తున్నారని అలాగే వారి యూట్యూబ్ ఛానల్ కూడా ప్రజలకు అన్ని కార్యక్రమాలను అందుబాటులో తీసుకువచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావు, సత్తెనపల్లి ఏడో వార్డు కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్, ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు బత్తుల కేశవ, సత్తెనపల్లి మండల అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు, నకరికల్లు మండల అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మి శ్రీనివాస్, ముప్పాళ్ళ మండల అధ్యక్షులు సిరిగిరి పవన్ కుమార్, దార్ల శ్రీను, అంపిరియాని రాజశేఖర్, రామిశెట్టి శ్రీను, నామాల పుష్ప, గట్టు శ్రీదేవి, చిలకాపూర్ణ, షేక్ ఖాసిం, షేక్ రఫీ, జనసైనికులు, వీర మహిళలు, మెగా అభిమానులు పాల్గొన్నారు.