మంగళగిరి ప్రీమియర్ లీగ్ మ్యాచ్ కు హాజరైన జనసేన నాయకులు

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకోని మంగళగిరి నియోజకవర్గ తెలుగు యువత ఆధ్వార్యాన నారా లోకేష్ క్రీడా ప్రాంగణం(భోగి ఎస్టేట్స్)లో జరుగుతున్న మంగళగిరి ప్రీమియర్ లీగ్ -2 (2024) పోటీలు ఆదివారం ఆఖరి దశ సందర్భంగా విజేతలకు బహుమతులు ప్రదానం కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకుల ఆహ్వానం మేరకు జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు మరియు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.