ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా షేక్ సాబ్జీ విజయం

ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా షేక్ సాబ్జీ విజయం సాదించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే షేక్ సాబ్జీ విజయం సాధించినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా షేక్ సాబ్జీ పని చేస్తున్నారు. ఆయన తన ప్రత్యర్ధి గంథం నారాయణరావు మీద 1537 ఆధిక్యంతో షేక్ సాబ్జీ విజయం సాదించారు. షేక్‌ సాబ్జీకి 7,983 ఓట్లు పోలవగా.. నారాయణరావుకు 6,446 ఓట్లు వచ్చాయి. రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపుతోనే సాబ్జీ విజయం ఖరారైంది. ఇది ఉపాధ్యాయుల సమిష్టి విజయం, అని ఉపాధ్యాయుల సమస్యలపై చట్టసభలో గళమెత్తి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ పేర్కొన్నారు. ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు 11 మంది అభ్యర్థులు పోటీ పడినా ప్రధానంగా కొద్ది మంది మధ్యే పోటీ నెలకొంది. ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య రాష్ర్ట అధ్యక్షుడుగా ఉన్న షేక్ సాబ్జీ పిడిఎఫ్ అభ్యర్థిగా ముందు నుండి ప్రధాన పోటీ దారుడిగా ఉన్నారు. ఇంతకుముందు యూటీఎఫ్ లో పని చేసి తరువాత బయటకు వచ్చిన సుభాష్ చంద్రబోస్ ఈయనకు ముందు పోటీ ఇచ్చారు. చంద్రబోస్ కు తెదేపా మద్దతు ఉంది. పీఆర్ టీయూ సంఘాల మద్దతుతో గంధం నారాయణరావు పోటీ చేయగా ఈయనకు రెండో స్థానం లభించింది. ఈయన ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు దగ్గరి బంధువు. బలమైన ఉపాధ్యాయ సంఘంగా యూటీఎఫ్ మద్దతుతో షేక్ సాబ్జీ గెలుపొందారు.