కరువు మండలాలుగా ప్రకటించాలి

  • జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు సిజి రాజశేఖర్

పత్తికొండ నియోజకవర్గం: విషయం పత్తికొండ నియోజకవర్గంలోని ఐదు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని జిల్లా కలెక్టర్ కు జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు సిజి రాజశేఖర్ వినతి పత్రం అందజేసారు. ఈ సందర్భంగా సిజి రాజశేఖర్ మాట్లాడుతూ కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం జనసేన పార్టీ తరపున జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతి అందజేశాం. మన పత్తికొండ నియోజకవర్గంలో రైతుల కష్టాలను బాధలను వివరిస్తూ, ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో అనుకూలమైన వర్షపాతం లేకపోవడంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి, సాగు చేసిన వివిధ రకాల పంటల రైతులకు పెట్టుబడి పెరగడం దానికి తోడు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం ప్రధాన సమస్య. సుమారుగా ఒక ఎకరాకు వివిధ రకాల పంటలు ఖర్చులు 20000 నుండి 40 వేల రూపాయల వరకు రైతులు ఖర్చుపెట్టి నష్టపోయారు. బ్యాంకుల దగ్గర మరియు దళారుల దగ్గర పంటల కోసం అప్పులు తీసుకొని కట్టుకోలేని స్థితిలో రైతులు ఉన్నారు. ఆ అప్పులు బాధ తట్టుకోలేక కొంతమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దాంతో రైతుల కుటుంబాలు చితికి పోతున్నాయి. రైతు పిల్లలను కూడా చదువులు మధ్యలో నిలిచి వేయించి బ్రతుకుతెరువు కోసం ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు, వెళుతున్నారు మరికొందరు చావులకు సిద్ధపడుతున్నారు. కావున జిల్లా కలెక్టర్ స్పందించి మా పత్తికొండ నియోజకవర్గంలోని 5 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని, రైతు కుటుంబాలను ఆదుకోవాలని తెలియజేశాం. కరువు మండలాలను ప్రకటించకపోతే రైతులు ఆత్మహత్య చేసుకుంటే వారి కుటుంబాలు రోడ్డున పడుతాయి కావున ఇలాంటి సంఘటనలు జరగకముందే, ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని తెలియజేశాం. ఒకవేళ రైతులు ఆత్మహత్య చేసుకుంటే దానికి, పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాల్సి ఉంటుందని తెలియజేయడం జరిగింది అని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు, ఎర్రి స్వామి, కరణం రవి, శ్రీనివాస్ రెడ్డి, వడ్డే వీరేష్ మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.