వేముల కార్తీక్ ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

తెలంగాణ, కొత్తగూడెం నియోజకవర్గం: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనసేన కుటుంబసభ్యుల భద్రత కోసం చేపట్టిన క్రియాశీలక సభ్యత్వాల కిట్లు పంపిణీ కార్యక్రమం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ గ్రామంలో సోమవారం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ మనోగతం బుక్, ఐడి కార్డ్, పార్టీ గుర్తు యొక్క గాజు గ్లాస్, వీటన్నిటినీ కలిపి ఒక కిట్టుగా ఇవ్వడం జరిగింది. పాల్వంచ మండల ప్రెసిడెంట్ రాంబాబు ఆధ్వర్యంలో కొత్తగూడెం నియోజకవర్గ ఇన్చార్జి వేముల కార్తీక్ చేతుల మీదగా, జనసేన కార్యకర్తలకు అభిమానులకి క్రియాశీలక సభ్యత్వ కిట్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మీరందరూ జనసేన పార్టీని బలపరుస్తూ, మరింత ప్రజల్లోకి పార్టీని, మరియు పార్టీ ఒక సిద్ధాంతాల్ని, తీసుకొని వెళ్లి, ప్రజలకు వివరించి, రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీని గెలిపించాలని కార్యకర్తలతో నాయకులతో, నియోజకవర్గ ఇన్చార్జి వేముల కార్తిక్ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్వంచ మండలం కార్యదర్శి దేవ గౌడ్, పాల్వంచ టౌన్ ప్రెసిడెంట్ ముత్యాల వీరబ్రహ్మం, వరప్రసాద్, బోసు బాబు, బైరెడ్డి రామానాయుడు, బైరెడ్డి వైకుంఠం, హరి, బచ్చు శంకర్, సంతోష్, కామేష్ తదితరులు పాల్గొన్నారు.