రాజమహేంద్రవరం లోనే విలీనం చేయాలి!

*రాయవరం మండల జే.ఏ.సీ కమిటీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష

మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం జిల్లాలోనే విలీనం చేయాలని రాయవరం మండలం జే.ఏ.సీ కమిటీ ఆధ్వర్యంలో రాయవరం మండల కార్యాలయం ఎదురుగా నిరాహార దీక్షలు చేపట్టారు. జనసేన పార్టీ తూర్పు గోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి దాలిపర్తి శ్రీనివాసు దీక్షా శిబిరాన్ని సందర్శించి పూర్తి మద్దతు గా ఉంటామని స్పష్టం చేశారు. చెల్లూరు జనసేన పార్టీ తరుపున వల్లూరి సత్య ప్రసాద్, గొల్లపల్లి వెంకటరమణ, తలాటం వెంకటేష్ తదితరులు పాల్గొని దీక్షకు సంఘీభావం తెలియజేశారు.