ఆర్థిక సహాయం అందుకొన్న సింగనమల నియోజకవర్గ రైతు కుటుంబాలు

జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ అనంతపురం జిల్లా కౌలు రైతుల భరోసా యాత్రలో భాగంగా జిల్లా అధ్యక్షులు టి.సి వరుణ్ ఆదేశాలు మేరకు ఇటీవల సాగు నష్టం, ఆర్థిక ఇబ్బందులు కారణంగా ఆత్మహత్య కు పాల్పడిన బుక్కరాయసముద్రం మండలం సంజీవపురం గ్రామ కౌలు రైతు పసుపుల గంగాధర్ భార్య సరస్వతి కి మరియు దయాలకుంటపల్లి గ్రామ కౌలు రైతు పుల్ల శివకుమార్ భార్య పుల్ల అంజలికి జనసేన పార్టీ తరుపున లక్ష రూపాయలు ఆర్థిక సహాయం మన్నీల గ్రామానికి మా సింగనమల నియోజకవర్గం నుంచి తీసుకెళ్లడం జరిగింది. జనసేన పార్టీ తరుపున వారి కుటుంబానికి అండగా ఉంటుంది అని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సింగనమల నియోజకవర్గ సీనియర్ నాయకులు మరియు జిల్లా అధికార ప్రతినిధి సాకే మురళీకృష్ణ, జిల్లా కార్యదర్శి చొప్ప చంద్ర, సంయుక్త కార్యదర్శి పురుషోతం రెడ్డి, జిల్లా నాయకులు కృష్ణ మూర్తి, బుక్కరాయసముద్రం జడ్పీటీసీ అభ్యర్థి మన్నల పెద్దిరాజు, బుక్కరాయసముద్రం మండల అధ్యక్షులు జి. ఏర్రిస్వామి, సింగనమల మండల అధ్యక్షులు తోట ఓబులేసు, గార్లదిన్నె మండల అధ్యక్షులు ఎర్రితాత, గుమ్మేపల్లి తోట ప్రవీణ్, తదితరులు హాజరయ్యారు.