కాకినాడలో సామాజిక చైతన్య యాత్ర

కాకినాడ సిటి, స్థానిక పాత బస్టాండ్ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ ఆలోచనా స్ఫూర్తితో సామాజిక చైతన్య యాత్ర కార్యక్రమం జనసేన పార్టీ కాకినాడ సిటి ఇంచార్జ్ & పి.ఏ.సి సభ్యులు ముత్తా శశిధర్ పూలే విగ్రహానికి పూలమాల వేసి కొనసాగించారు. ఈ సందర్భంగా ముత్తా శశిధర్ మాట్లాడుతూ తమ నాయకుడు పవన్ కళ్యాణ్ సమాజలో అన్ని కులాలవారు నిజమైన అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చిన స్ఫూర్తితో తాము అమరజీవి జయంతి నుండి అంబేడ్కర్ జయంతి వరకు అనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు వివరించారు. నేటి ఈ వై.సి.పి ప్రభుత్వం మసి పూసి మాయ చేసినట్టు రూపాయ నిధుల్లేని వివిధ కులాల పేర్లతో కార్పోరేషన్లను ఏర్పాటు చేసి వాటికి చైర్మన్లను నియమించి ప్రచారంతో ఆర్భాటం చేసి ఊదరగొట్టిందనీ, వీటివల్ల పేద కులాలకు ఏరకమైన ప్రయోజనం పొందిన దాఖలాలు లేవన్నారు. అంటే ముఖ్యమంత్రి ఉద్దేశంలో పేద బహుజన కులాలు అంటే ఇంత చులకనా అని ప్రశ్నించారు. జనసేన పార్టీ ఈ ముఖ్యమంత్రి వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ ప్రభుత్వ వైఖరిని ప్రజల్లోకి తీసుకువెళ్ళి చైతన్య పరచాలని ఈ యాత్రని చేపట్టామని వివరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటి జనసేన పార్టీ అధ్యక్షుడు సంగిశెట్టి అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, బలసాడి శ్రీను, అన్నవరం, బాబూరావ్, రమణ, శ్రీను, గంగరాజు మరియు వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.