వర్షం కారణంగా రోడ్డుపై అడ్డంగా విరిగి పడిన చెట్లను తొలగించిన జనసైనికులు

అయినవోలు మండల్: వర్షం కారణంగా అయినవోలు మండల్, నిర్మల గూడెం క్రాస్ వద్ద ఆదివారం కొన్ని చెట్లు విరిగి రోడ్లమీద పడడం జరిగింది. ట్రాఫిక్ అంతరాయం కలిగించకుండా.. జనసేన పార్టీ జనసైనికులు రోడ్డుకు అడ్డంగా ఉన్న ఆ చెట్లను అక్కడి నుంచి పక్కకు తొలగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అయినవోలు మండల అధ్యక్షుడు బర్ల శివ, బర్ల ప్రవీణ్, బర్ల మహేందర్, ఆకులపల్లి వినయ్ కుమార్, ఆకులపల్లి శ్రీకాంత్, బర్ల జానీ, శేఖర్, బర్ల అజయ్ ఇతరులు పాల్గొన్నారు.