జనసేన పార్టీ రాజమహేంద్రవరం కార్పొరేషన్ అధ్యక్షులును కలిసిన సిటీ జనసైనికులు

జనసేన పార్టీ రాజమహేంద్రవరం కార్పొరేషన్ అధ్యక్షులుగా నియమించబడిన వై.శ్రీనివాస రావు ని శాటిలైట్ సిటి జనసైనికులు మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా జనసైనికులు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి అధ్యక్షులు గౌ.శ్రీ పవన్ కళ్యాణ్ కి ఆప్తులుగా పేరుండి జిల్లాలో, నగరంలో పార్టీని ముందుకు నడిపిన వై. శ్రీనివాస్ రావు భవిషత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని శాటిలైట్ సిటి జనసైనికుల కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో సునీల్, నాగేంద్ర, దుర్గారావు, శ్రీను, సుబ్బారావు, సతీష్, గోపి, సూరిబాబు, ప్రసాద్ బాబు , సుబ్బు, శివ, ప్రసాద్, వాసు, చింటూ, సుబ్రహ్మణ్యం, మొదలగు వారు పాల్గొన్నారు.