పుల్వామా ఘటనలో మృతిచెందిన వీరజవాన్లకు ఘననివాళులు

విజయనగరం జిల్లా, పార్వతీపురం నియోజకవర్గంలో పుల్వామా దాడిలో అమర వీరులైన మన వీరజవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని, బలిజిపేటలో కొవ్వొత్తుల ర్యాలీ జనసేన ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలురు మరియు మండల జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొనడం జరిగింది.