నారా లోకేష్ కు విశాఖ జిల్లా జనసేన నేతల సంఘీభావం

రాజమహేంద్రవరం: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు విశాఖ జిల్లా జనసేన నేతలు సంఘీభావం తెలిపారు. జనసేన రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్, చోడవరం ఇంచార్జ్ పి.ఎస్. ఎన్.రాజు, కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ బుధవారం రాజమహేంద్రవరంలో లోకేష్ ను కలిసి పరామర్శించారు. చంద్రబాబును తప్పుడు కేసులతోనే జైలుపాలు చేశారని మండిపడ్డారు. అక్రమ కేసులతో ప్రభుత్వం ప్రతిపక్షాలను ఇబ్బందులు పెడుతోందని అన్నారు. జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు ఛీత్కరించుకుంటున్నారని మండిపడ్డారు. తనకు అండగా నిలుస్తున్న జనసేన నేతలకు లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీని రాష్ట్రం నుండి తరిమికొట్టేందుకు అంతా కలిసి పోరాడతామన్నారు.