పారిశుద్ధ్య సమస్యను వెంటనే పరిష్కరించండి: షేక్ మహబూబ్ మస్తాన్

అనంత సాగరం మండలంలోని పలు గ్రామాల్లో పారిశుద్ధ్యం చాలా దారుణంగా ఉంది. అదేవిధంగా పారిశుద్ధ్యంతో పాటు రోడ్ సైడ్ కాలువ పూడిక తీయక కూడా పలు గ్రామాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పాత దేవరపల్లి పంచాయతీ.. ఇనగలూరు పంచాయతీ గ్రామాలకు సంబంధించిన పంచాయతీ సిబ్బందిచేత.. మండల అధికారులు వెంటనే పారిశుద్ద్యం కార్యక్రమం చేపట్టి.. రోడ్లు, కాలువలు శుభ్రం చేయించి.. పారిశుద్ధ్య సమస్యను వెంటనే పరిష్కరించాలని జనసేన పార్టీ తరపున మండల అధ్యక్షులు షేక్ మహబూబ్ మస్తాన్ పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది.