తెలంగాణ వారికి రాజ్యసభ సీటు తాకట్టు పెట్టడానికి కారణం..?: కొట్టే వెంకట రాజేష్

కడపజిల్లా, రాజంపేట నియోజకవర్గం, సిధ్ధవటం: రాజ్యసభ సీటు ఎంపిక విషయంపై స్పందించిన సిధ్ధవటం మండల జనసేన నాయకులు కొట్టే వెంకట రాజేష్.. మీడియాముఖంగా మాట్లాడుతూ.. ఏపీలో బీసీలు, కాపులు, మైనారిటీ, ధలిత, క్రిస్టియన్ సోదరులు ఈ వైసీపీ పార్టీకి అండగా వుండి ఓట్లు వేసి భారీ మెజారిటీతో ఈ సీబీఐ దత్తపుత్రుడిని.. జైలు పక్షిని సీయం చేస్తే.. ఆయన కేసులు వాధించే రెడ్డికి.. తెలంగాణలో తన చెల్లెలు పార్టీ బలోపేతానికి.. బీసీలను ఓటు బ్యాంకుగా మల్చుకునే విధంగా తెలంగాణ బీసీ నాయకుడీకీ రాజ్యసభ సీటు ఇచ్చి.. ఆంధ్రా లో వున్న వివిధ సామాజిక వర్గాలకు నమ్మక ద్రోహం చేసిన ఈ జైలు పక్షి ఆంధ్రా బాగోగులకు ఆంధ్రా ప్రజలను ఢిల్లీ రాజ్యసభకు పంపితే వారు సభలో మన సమస్యలు లేవనెత్తి మనకూ నిధులు తెచ్చి ఏపీ అభివృద్ధికీ తోడ్పడతారు కానీ మీరు తెలంగాణ వారికి ఈ రాజ్యసభ సీట్లు తాకట్టు పెట్టడం ఏంటీ..? నీ కేసుల కోసం.. నీ చెల్లి రాజకీయ పార్టీ కోసం ఆంధ్రాను తాకట్టు పెడితే ఏపీ ప్రజలు చూస్తూ ఊరుకోరని.. రాబోవు రోజుల్లో మీకు ఈ ప్రజలు గుణపాఠం చెబుతారని.. రాబోయే జనసేన ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే పనిచేస్తుందని ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించాలని రాజంపేట నియోజకవర్గ ప్రజలను మీడియా ముఖంగా కొట్టే వెంకట రాజేష్ కోరడం జరిగింది. ఈ మీడియా సమావేశంలో జనసైనికులు పాల్గొనడం జరిగింది.