ప్రతి నియోజకవర్గంలో మహిళలకు రక్షణగా వీరమహిళలు: గాదె

*గుంటూరు జిల్లా జనసేన వీరహిళల సమావేశం

రాష్ట్రంలో మహిళలకు, ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని.. బయటకు రావాలంటే భయపడుతున్నారని జిల్లా అధ్యక్షుడు గాదె అన్నారు. గుంటూరు జిల్లాలో జరిగిన వీరహిళల సమావేశంలో వెంకటేశ్వర రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆలోచనలు ప్రజల్లోకి తీసుకెళ్లేలా.. మహిళలకు మరింత ప్రాధాన్యం కల్పించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశామని గాదె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 500 మందికి పైగా మహిళలు పాల్గొన్నారు.

ఇక జిల్లా లో ఎక్కడ ఆత్యాచారం జరిగినా.. మహిళలపై దాడులు జరిగినా.. అధికార పార్టీ వ్యక్తులు బెదిరించిన వారికి అండగా జనసేన వీరమహిళలు ఉంటారని చెప్పారు.. త్వరలోనే పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయం మేరకు జిల్లావ్యాప్తంగా మహిళా కమిటీలు వేస్తామని … పార్టీని మహిళలకు మరింత చేరువ చేయాలని కోరారు.

ఈ అరాచక పాలనలో మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని.. వివక్షకు గురవుతున్నా కనీసం పట్టించు కోవడం లేదన్నారు.. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితేనే ఇటువంటి ఆగడాలకుచెక్ పడుతుందన్నారు.. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు, మహిళలు, రాష్ట్ర, జిల్లా, నగర అధ్యక్షులు మరియు నాయకులు పాల్గొన్నారు.