పితాని చొరవతో సమస్యకు పరిష్కారం

ముమ్మిడివరం, ఇటీవల మత్స్యకార గ్రామాల్లో వారి సమస్యలు తెలుసుకోవడానికి పర్యటిస్తున్న జనసేనపార్టీ పి.ఏ.సి. సభ్యులు, ముమ్మిడివరం జనసేనపార్టీ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ గారికి బలుసుతిప్ప గ్రామస్తులు గ్రామంలో చేతికి అందేంత ఎత్తులో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ను ఏర్పాటు చేసారని ఎప్పటినుండో తొలగించాలని ఆందోళన చేస్తున్నా ట్రాన్స్ కో అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాన్స్ ఫార్మర్ ను పరిశీలించిన పితాని వెంటనే ట్రాన్స్ ఫార్మర్ ను సురక్షిత ప్రదేశంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ట్రాన్స్ కో అధికారులతో మాట్లాడి దీనిపై స్పందించకపోతే జనసేన తరపున పోరాటం చేస్తామని వెంటనే ట్రాన్స్ ఫార్మర్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. అధికారులు ట్రాన్స్ ఫార్మర్ ను తొలగించారు. సమస్యపై స్పందించి ట్రాన్స్ ఫార్మర్ ను తొలగించినందుకు జనసేనపార్టీ తరుపున పితాని బాలకృష్ణ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.