త్వరలో పవన్ కళ్యాణ్ క్షేత్ర స్థాయి పర్యటనలు

మంగళగిరి: జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మరియు జనసేన-టిడిపి సమన్వయ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని సోమవారం మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో గజపతినగరం నియోజకవర్గ ఇంచార్జి మర్రాపు సురేష్ మర్యాదపూర్వకంగా కలిసి నియోజవర్గంలో జరిగే కార్యక్రమాలు, ప్రధానమైన సమస్యలు పై చర్చించడం జరిగింది, ఎన్నికల సమరానికి త్వరలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి క్షేత్ర స్థాయి పర్యటనలు, రోజుకి మూడు సభల నిర్వహణకు ప్రణాళిక, కష్టపడి పని చేసే ప్రతి ఒక్కరిని పార్టీ గుండెల్లో పెట్టుకుంటుంది అని అన్నారు.