కశింకోట మండల జనసేన కార్యదర్శిగా గూడెపు మణికంఠ నియామకం

అనకాపల్లి నియోజకవర్గం: కశింకోట మండలానికి నూతన మండల కమిటీని ఏర్పాటు చేసినట్లు అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఈ మండల కమిటీలో జమాదులపాలెం గ్రామానికి చెందిన గూడెపు మణికంఠ మండల జనసేన పార్టీ కార్యదర్శి (సెక్రటరీ)గా నియమితులయ్యారు. మణికంఠ గతంలో 2010 నుండి 2014 జనసేన ఆవిర్భావం ముందు వరకు లోకసత్తా పార్టీ యాక్టివ్ మెంబెర్ గా పనిచేసిన అనుభవంతో ఉంది. అనకాపల్లి జనసేన పార్టీ కశింకోట మండల కోర్ కమిటీ సభ్యులు గా కూడా ఇప్పటివరకు కొనసాగుతూ సేవలు అందిస్తున్నారు. 2014 నుండి జనసేన తో ప్రయాణం ప్రారంభించగా, 2019 ఎన్నికల్లో క్రియశీలకంగా పనిచేసి, ఎన్నికల అనంతరం పార్టీ కార్యక్రమాలలో కీలకంగా వ్యవహరిస్తూ పార్టీలో ముఖ్యులు గా సేవలు అందిస్తున్నారు. జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ పరుచూరి భాస్కరరావు గారు ఈ మండల కమిటీ నియామకాలకి ఆమోదం తెలిపి, మండల కమిటీని ప్రకటించారు. ఈ కశింకోట మండల కమిటీకి బుదిరెడ్డి చిన్నా అధ్యక్షులు కాగా, ఉపాధ్యక్షులుగా కలగ శ్రీనివాసరావు, గండిబోయిన కాశీరావు లు, ప్రధాన కార్యదర్శులుగా కర్రి గోవింద్ (పిఆర్పీ గోవింద్), ఉత్తాడ రామరాజు లు నియమితులు కాగా, కార్యదర్శి మరియు సంయుక్త కార్యదర్శులుగా గొంతిన ఈశ్వరరావు, మజ్జి బాబ్జి, కలిగెట్ల వీరబాబు, మదిన అప్పారావు, ఊడి నూకరాజు, గుదిబండ జాన్, రెడ్డి ధనలక్ష్మి, గారా లోవరాజు, కొల్లి ఆనంద్ లతో కమిటీని నియమించారు. ఈ నియామకాల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ఇంచార్జ్ పరుచూరి భాస్కరరావు, మండల అధ్యక్షులు బుదిరెడ్డి చిన్నా, జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి పావాడ కామరాజు లకు మండల కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.