వారాహి యాత్ర విజయవంతం కావాలని భామిని జనసేన ప్రత్యేక పూజలు

పాలకొండ నియోజకవర్గం: భామిని మండల జనసేన నాయకులు, జనసైనికులు జనసేన అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర విజయవంతం కావాలని ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ సంతోషిమాత దేవాలయంలో బుధవారం ప్రత్యేక పూజలు జరిపించడం జరిగింది. దీనికి ముఖ్య అతిధులుగా భామిని మండలం మాజీ జెడ్పిటిసి నిమ్మక నిబ్రం, మరియు రుంకు దందాసే, జనసైనికులు బొబ్బోది హరిబాబు, సింహాచలం, కుమ్మరి సునీల్, సింహాచలం, మల్లేషు, మనికంట తదితరులు పాల్గొన్నారు.