దర్శి కనక దుర్గమ్మ ఆలయంలో వారాహి కోసం ప్రత్యేక పూజలు

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేపట్టనున్న యాత్ర కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన వారాహి వాహనానికి విజయవాడలోని కనకదుర్గమ్మ సన్నిధిలో నిర్వహించనున్న ప్రత్యేక పూజల సందర్భంగా మంగళవారం దర్శిలోని అద్దంకి రోడ్డులో గల శ్రీకనక దుర్గమ్మ ఆలయంలో జనసైనికులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి కృపతో యాత్ర విజయవంతంగా పూర్తికావాలని, పవన్‌ కల్యాన్‌కు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఐటి కోఆర్డినేటర్ ఉల్లి బ్రహ్మయ్య జనసేన పార్టీ జిల్లా ప్రోగ్రామ్‌ కమిటీ సభ్యులు మరియు పడమర గంగవరం వార్డు మెంబర్‌ పసుపులేటి చిరంజీవి, పార్టీ దర్శి పట్టణ అధ్యక్షులు చాతరాశి కొండయ్య, నియోజకవర్గ నాయకులు పుప్పాల పాపారావు, ఉల్లి వెంకటేష్, ఉప్పు అంజి, ఎస్ కే వెంకటేష్, ఎస్ కే భాష, తిరుమల వెంకటేశ్వర్లు, చొప్పరపు తేజ, తదితరులు పాల్గొన్నారు.