మహాశివరాత్రి సందర్భంగా వంగ లక్ష్మణ్ గౌడ్ ప్రత్యేక పూజలు

  • రాబోయ్యే రోజుల్లో జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావాలి
  • ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ రాణించాలి
  • తెలంగాణలో జనసేన పార్టీ రాబొయ్యే రోజుల్లో పోటీ చేసిన స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందడుగు

నాగర్ కర్నూల్, శనివారం మహాశివరాత్రి సందర్భంగా ఉమామహేశ్వరంలోని శివాలయంలో ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ విజయ భేరి మోగిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ లో రాణించాలనీ, తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ రాబోయ్యే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే దిశగా అడుగులు వేయాలని, తెలుగు రాష్ట్రాల ప్రజలపై మహాశివుడి చల్లిని ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటూ శివయ్యకు మరియు ఆంజనేయ స్వామి ఆలయంలో వంగ లక్ష్మణ్ గౌడ్ ప్రత్యేక పూజలు చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.