పవన్, వారాహి పేరిట గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు

పుంగనూరు నియోజకవర్గం: పుంగనూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనహితం కోరే పవన్ కళ్యాణ్ చేపడుతున్న “వారాహి యాత్ర” విజయవంతం కావాలని, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని నగీరిలో వెలసిన పుంగనూరు ఇలవేల్పు శ్రీ సుగుటురు గంగమ్మ తల్లి వారి ఆలయం వర్ద పుంగనూరు జనసైనికులు అమ్మ వారికి పూజా, కార్యక్రమాలు చేసి 101 టెంకాయల సమర్పణ జరిపించి మొక్కుబడి తీర్చుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు విరూపాక్ష, టౌన్ ప్రసిడెంట్ నరేష్ రాయల్, జిల్లా పోగ్రామ్స్ కమిటీ సెక్రటరీ చైతన్య రాయల్, ఐటీ ఇంచార్జీ దేశాది వికాస్, గణేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ నందు, వైస్ ప్రెసిడెంట్లు చంద్ర, సుబ్బు, మనగాని మోహన్ & జనసైనికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.