వారాహి యాత్ర ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులకు నాంది

కళ్యాణదుర్గం నియోజకవర్గం: జనహితం కోరే జనసేనాని శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చేపట్టబోతున్న వారాహి యాత్ర విజయవంతం కావాలని కళ్యాణదుర్గం పట్టణం, కోట వీధిలో శ్రీ అభయాంజనేయ స్వామి పాదాల చెంత మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమం జనసైనికుల సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.. ఈ సందర్భంగా బాల్యం రాజేష్ మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో మార్పు కోసం, ఓ నూతన అధ్యాయ నిర్మాణం కోసం, ప్రజా సమస్యలపై బలమైన పోరాటం చేసేందుకు వారాహి యాత్రను జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నవరం సత్యదేవుడి దర్శనం అనంతరం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభించబోతున్నారు, కేవలం ఎన్నికల కోసమే ఈ యాత్ర కాదు, ప్రజల బాధలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వారితో మమేకమైఎందుకు, ఇదో చరిత్రలో నిలిచిపోయే యాత్ర కాబోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అనిచ్చితి పరిస్థితుల నుండి గట్టెక్కాలంటే జనసేన పాలన రావాల్సిందే అని ఆశాభావంతో రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఇంకా అనేక వర్గాల ప్రజలు ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తి గానే ఆత్మహత్య చేసుకున్న వేలాది మంది కౌలు రైతు కుటుంబాలకు ఆపన్నహస్తం అందిస్తున్న విధానాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న ప్రజలు ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అనే శక్తిని అందజేస్తే ఇంకెంతో మందికి ఉపయోగకరమైన సేవలు అందిస్తారనే భావన ప్రజల్లో బలంగా నాటుకుందని. ప్రజాధనం ధనం ఒక్క రూపాయి కూడా వృధా కాకుండా, అప్పులను అదుపు చేస్తూ, అభివృద్ధి బాటలు వేయగల సమర్థ నిజాయితీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారి అనే భావన ప్రజల్లో బలంగా ఉందని. రాష్ట్ర పరిపాలన విధానాల్లో ఖచ్చితమైన జవాబిదారితనం జనసేనతో మాత్రమే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.. మరి కొద్ది రోజుల్లో నియోజక వ్యాప్తంగా ప్రతి పల్లెకు ఇంటి ఇంటికి జనసేన కార్యక్రమం జనసేన సిద్దాంతాలు, షణ్ముఖ వ్యూహం, ప్రజలలో మరింతగా తీసుకెళ్లే విధంగా, ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించే విధంగా ఉంటుందని తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన పార్టీ జాయింట్ సెక్రటరీ బాల్యం రాజేష్, కుందుర్పి మండల అధ్యక్షులు జయకృష్ణ, బ్రహ్మసముద్రం మండల అధ్యక్షుడు ఆంజనేయులు, జనసేన వీరమహిళలు, షేక్ తార, యాదవ త్రివేణి, జనసేన నాయకులు వంశీకృష్ణ, ముక్కన్న, జాకీర్, శ్రీ హర్ష, మహేష్ జాఫర్, నవదీప్, సురేష్, బేబీ ప్రణతి మొదలైన జనసైనికులు పాల్గొనడం జరిగింది.