సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప

తిరుమల శ్రీనివాసుడి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.. బ్రహ్మోత్సవాలలో కీలకమైన ఎనిమిదో రోజున, శనివారం ఉదయం ఆలయంలోని కళ్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు సర్వ భూపాల వాహనంపై భక్తులకు దర్శనమిస్తూ కనువిందు చేశారు.  అర్చకులు వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమంలో తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ వై.వి సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, పలువురు అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.