కేంద్ర ఐటీ శాఖలో జాబ్స్ నోటిఫికేషన్‌

కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-MeitY యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్‌లో ఈ పోస్టులు ఉన్నాయి. ఇవి మూడేళ్ల లోపు కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. పలు అంశాల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో పనిచేయడానికి ఆసక్తి ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి తగిన అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. అర్హతలు ఉన్న అభ్యర్థులు మాత్రమే అప్లై చేయాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను www.meity.gov.in/ లేదా negd.gov.in/ వెబ్‌సైట్లలో తెలుసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు: 25

స్టైపెండ్ నెలకు: రూ.60,000

అప్లై చేయడానికి చివరి తేదీ: 2020 సెప్టెంబర్ 30

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి

దరఖాస్తు ఫామ్ లింక్ నోటిఫికేషన్‌లోనే ఉంటుంది. www.meity.gov.in/ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేయొచ్చు. దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని చివరి తేదీ లోగా negdadmin@digitalindia.gov.in మెయిల్ ఐడీకి పంపించాలి.