ఈదిముడి గ్రామంలో మరో ఇసుక దోపిడి: ఎస్ వి బాబు

  • చేతులెత్తేసిన రెవెన్యూ శాఖ
  • అంతా నా ఇష్టం అంటూనే ఇసుక దొంగలు
  • ఇదేమి కర్మరా అంటున్న ప్రజలు

పెడన మండలం, ఈదిమూడి గ్రామంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. మొన్న ఈమధ్య ఈదిమూడి గ్రామానికి చెందిన ఓ రైతు తన ఇంటి అవసరాల కోసం మట్టిని తరలిస్తుంటే ఆగ మేఘాల మీద రెవెన్యూ శాఖ సిబ్బంది ఆపారు. ఇప్పుడు అక్రమ దారులు మట్టి దొంగిలిస్తున్నారని సాక్షాత్తు పెడన ఎమ్మార్వో గారికి ఫోన్ చేసినప్పటికీ స్పందన శూన్యం. మంత్రి అండదండలు, రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం మట్టి దొంగలకు మూడు ట్రాక్టర్లు, ఆరు టిప్పర్ లాగా ఇసుక దోపిడీ సాగిపోతుంది. నువ్వే మా భవిష్యత్తు అంటూ ఇంటింటికి స్టిక్కర్లు అంటిస్తూ, మాకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నారంటూ జనాలు గగ్గోలు పెడుతున్నారని పెడన నియోజకవర్గ జనసేన నాయకులు ఎస్ వి బాబు అన్నారు.