శ్రీ వేంకటేశ్వరస్వామి కళ్యాణ రధోత్సవం-జనసేన ఆధ్వర్యంలో చలి వేంద్రం

అమలాపురం పట్టణం మహిపాల వీధిలో శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణం-రధోత్సవం జరిగింది. ఈ మహోత్సవాలకు వచ్చే భక్తులు దాహార్తిని తీర్చడానికి స్థానిక 7వ వార్డులోని వినాయకుని గుడి వద్ద జనసేన నాయకులు చిక్కం బాలాజీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని జనసేన పార్టీ క్రియాశీలక నాయకులు అర్.డి.యస్. ప్రసాద్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. భక్తులకు, పాదచారులకు చల్లటి రస్నా డ్రింక్ ను అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ప్రతిపక్ష నేత యేడిద శ్రీను, కౌన్సిలర్ పడాల శ్రీదేవి నానాజీ, రూరల్ మండల అధ్యక్షులు లింగోలు పండు, రాష్ట్ర చేనేత విభాగం ప్రధాన కార్యదర్శి బట్టు పండు, రాష్ట్ర డాక్టర్స్ సెల్ కార్యదర్శి కొప్పుల నాగ మానస, నల్లా నాయుడు, 9వ వార్డు నాయకులు నల్లా చిన్ని, మోటూరి వెంకటేశ్వర రావు, వాకపల్లి వేంకటేశ్వరరావు, తిక్కా సరస్వతి, చిక్కం గణేష్, పోలిశెట్టి కన్నా, జంగా లోవరాజు, పోలిశెట్టి మహేష్, మద్ధింశెట్టి దుర్గ, డి.యస్.యన్. కుమార్, సత్తి శివ, గెట్టం వీరు, గమిని సాయి, గోకరకొండ నాగు, నాగులపల్లి భిమేష్, నామన చిన్నా, గుబ్బల శేఖర్ మరియు జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.