శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీలో చేరికలు

శ్రీకాళహస్తి, జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం, రేణిగుంట మండల, పట్టణ నాయకులు, జనసైనికులు, వీరమహిళలతో మండల అధ్యక్షులు మునికుమార్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు విజయ ఆనంద రావు అధ్వర్యంలో నియోజకవర్గ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా రేణిగుంట పట్టణంలోని ఎస్.ఆర్ ఫంక్షన్ హాల్ నందు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి పెద్ద ఎత్తున మండలం, పట్టణం నుండి దాదాపు 100 మందికి పైగా యువత, పెద్దలు మండల అధ్యక్షుడు ముణికుమర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు విజయ్ ఆనందరావు అధ్వర్యంలో వినుత చేతులు మీదుగా పార్టీ కండువా వేసుకొని పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా మండల, పట్టణ కమిటీ నియామకం, పార్టీ గ్రామ స్థాయి బలోపేతం గురించి చర్చించడం జరిగింది. రాబోయే 2024లో నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలుపు దిశగా చేయవలసిన కార్యాచరణను చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు ఉమ మహేశ్వరి, భాగ్య, మునికుమార్ పాలూరు, మనోజ్ కుమార్, జగదీష్, త్యాగరాజులు, పార్థసారథి, గంట మార్క్, రామమూర్తి, నాధముని, లోకనాదం, మాధవ్, శివ, ఉష, వెంకట్రావు, జ్యోతి, పద్మనాభం, శంకర్, నాగరాజు, దేవేంద్ర, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.