తుదిశ్వాస విడిచిన ప్రజారాజ్యం పార్టీతో గెలిచిన ఎమ్మెల్యే(మాజీ) ముంగమూరి శ్రీధర్ కృష్ణారెడ్డి

నెల్లూరు నగరంలో మెగా అభిమానాన్ని ప్రజారాజ్యం పార్టీతో గెలిచిన ఎమ్మెల్యే(మాజీ) ముంగమూరి శ్రీధర్ కృష్ణారెడ్డి సోమవారం ఆకస్మికంగా పరమపదించారు. ఈ సందర్బంగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ తరపున జిల్లా ప్రదాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఆయన పార్ధీవ దేహన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వారి అకాల మరణానికి చింతిస్తున్నామని,వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ తరపున ప్రగాఢ సానుభూతి తెలిపారు.