టు వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమైన శ్రీనివాసరాజు

రాజంపేట: యల్లటూరు భవన్ జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం రాజంపేట పట్టణ టు వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ సంబంధించిన సభ్యులు రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు యల్లటూరు శ్రీనివాసరాజును కలవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీనివాసరాజు గారి రాజకీయ ఎదుగుదలకు మేమంతా ఎప్పుడూ అండగా వుంటామని ఆయన ఉన్నత ప్రభుత్వ ఉద్యోగిగా వుంటూ ప్రజల కోసం రాజానామా చేసి వచ్చారని ఆయన ఎప్పటికీ ప్రజలమనిషి అని కొనియాడారు. వారందరూ కోరినట్లు రాజంపేటలో ఆటోషెడ్ నిర్మాణానికి కృషి చేస్తానని యల్లటూరు శ్రీనివాసరాజు మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజంపేట నాయకులు శింగంశెట్టి నరేంద్ర, మాజీ జెడ్పీటీసి యల్లటూరు శివరామరాజు, ఆకుల చలపతి, నాసర్ ఖాన్, అసోసియేషన్ వ్యవస్థాపకులు సుభాన్, ప్రెసిడెంట్ రాము, వైస్ ప్రెసిడెంట్ రవి, సలహాదారులు కాలేషా, ట్రెజరర్ హరి, సెక్రటరీ అబ్దుల్లా, అజీజ్, రవి, నజీర్, సుబ్బరాజు, అమీర్, మహమ్మద్, బాషా, అంజి, రఫీ, షఫీ, ఇస్మాయిల్, హజర్, హరి, లోకేష్, వాహిద్, కళ్యాణ్, బాలాజి, జిలాని బాషా, రఫీ, బాలా రెడ్డి, సాయి, చంద్ర తదితరులు పాల్గొన్నారు.