కవులారు మరియు పినపాక గ్రామాలలో జనసేన రచ్చబండ

మైలవరం, జి.కొండూరు మండల పార్టీ ప్రెసిడెంట్ వై ఎల్ నరసింహారావు ఆధ్వర్యంలో మైలవరం నియోజకవర్గం జి.కొండూరు మండలం పినపాక కవులూరు గ్రామాలలో జనసేన రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గ్రామాలలోని రైతులు, కార్మికులు, కూలీలు అనేక సమస్యలు చెప్పారు. దానికి మైలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ అక్కల రామ మోహన్ రావు (గాంధీ) మాట్లాడుతూ ప్రజల సమస్యలు తీర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రజా సమస్యల పరిష్కార దిశగా జనసేన పార్టీ కృషి చేస్తుందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ అక్కల రామ్ మోహన్ రావు, జి.కొండూరు మండల పార్టీ ప్రెసిడెంట్ యర్రబోలు నరసింహారావు, బుల్లా రాజు మరియు జనసేన నాయకులు నాగేశ్వరరావు, కిషోర్, రఘు, నాగరాజు, గోపి, వెంకటేశ్వరావు, గణేష్, రాజు, సంజు, జాన్,,శ్రీనివాస్ మరియు వీరమహిళ సుజాత పాల్గొనటం జరిగింది.