జనసేన అడ్డాగా మారిన శ్రీరాంపురం

జనసేన పార్టీ బలోపేతం చేయడంలో భాగంగా బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో.. రాజానగరం నియోజవర్గస్థాయిలో జనం సమస్య అని వస్తే నాయకులు అందుబాటులో ఉండేందుకు మూడు మండలాలలోనూ, గ్రామాల్లోనూ జనసేన పార్టీ కార్యాలయాల ఏర్పాటు సాగుతోంది. బత్తుల బలరామకృష్ణ నాయకత్వంలో రాజానగరఒ నియోజకవర్గంలోని శ్రీరాంపురం గ్రామంలో సోమవారం జరిగిన జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా జనం మెచ్చిన నాయకుడు బత్తుల బలరామకృష్ణ ను శ్రీరాంపురం ఆడపడుచుల ఆనందంగా నీరాజనాలతో ఆహ్వానించారు. ఈ వేడుక చూస్తే జనసేన విజయోత్సవమా అన్నట్టు అనిపించింది. పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవ వేడుకకు హాజరయిన జనాన్ని చూస్తుంటే జనసేన గెలుపు ఖాయమని అనిపిస్తోంది. వివిధ కులాల, మతాల పార్టీల నుండి వందలు, వేలుగా పార్టీలో చేరుతున్నారు. కేవలం చేరికతో ఆగకుండా పార్టీతో సమన్వయాన్ని పాటిస్తూ.. పార్టీలో జరుగుతున్న అన్ని కార్యక్రమాలకు తమవంతుగా హాజరవుతూ, పార్టీ బలాన్ని తెలియ జేస్తున్నారు.