ప్రారంభమైన నిజామాబాద్ ఎమ్మెల్సీ కౌంటింగ్‌

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ జరుగుతున్నది. ఓట్లలెక్కింపు కోసం ఆరు టేబుళ్లు ఏర్పాటుచేశారు. మొత్తం రెండు రౌండ్లలో ఓట్లు లెక్కిస్తారు. మొదటి రౌండ్‌లో 600 ఓట్లు, రెండోరౌండ్‌లో మిగిలిన 221 ఓట్లను లెక్కించనున్నారు. దీంతో ఉదయం 10.30 గంటల కల్లా ఫలితం వచ్చేస్తుంది. లెక్కింపు కేంద్రానికి ఒక్కో పార్టీ నుంచి ఎనిమిది మందిని అనుమతించారు.