చేవెళ్ల నుంచి ప్రారంభమైన.. షర్మిల పాదయాత్ర

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బుధవారం చేవెళ్ల నుంచి ప్రజాప్రస్థానం పాదయాత్రను ప్రారంభించారు. వైఎస్‌ విజయమ్మ జెండా ఊపి ఈ పాదయత్రను ప్రారంభించారు. 400 రోజులపాటు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి తిరిగి చేవెళ్లలోనే ముగించనున్నాను. కాగా, జూలై 8న వైఎస్సార్‌టీపీ ఆవిర్భవించిన సమయంలోనే తాను పాదయాత్ర చేపడతానని షర్మిల ప్రకటించారు. తెలంగాణలో వైఎస్సార్‌ పాలనను తీసుకురావడమే లక్ష్యంగా పాదయాత్ర చేపట్టనున్నట్లు ఆమె పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు, వైఎస్సార్‌ అభిమానులు మనస్ఫూర్తిగా తనను ఆశీర్వరదించాలని కోరారు.