రాజమండ్రి చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్

జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మధ్యాహ్నం 12 గం.కి టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారితో భేటీ అవుతారు. ఇందుకోసం శ్రీ పవన్ కళ్యాణ్ గారు కొద్దిసేపటి క్రితం రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. పార్టీ నేతలు, వీరమహిళలు, జనసైనికులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్, పిఏసీ సభ్యులు ముత్తా శశిధర్, పితాని బాలకృష్ణ, పార్టీ నేతలు శెట్టిబత్తుల రాజబాబు, అనుశ్రీ సత్యనారాయణ, బండారు శ్రీనివాస్, వేగుళ్ల లీలాకృష్ణ, తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, మర్రెడ్డి శ్రీనివాస్, తుమ్మల రామస్వామి, బత్తుల బలరామకృష్ణ, వరుపుల తమ్మయ్య బాబు, పోలిశెట్టి చంద్రశేఖర్, యర్నాగుల శ్రీనివాస్, తోట సుధీర్, పంచకర్ల సందీప్, విడివాడ రామచంద్రరావు, మేడా గురుదత్ ప్రసాద్, శ్రీమతి గంటా స్వరూప, శ్రీమతి ప్రియా సౌజన్య, బోడపాటి శివదత్ తదితరులు పాల్గొన్నారు.