స్టీల్ ప్లాంట్‌ పరిరక్షణ పోరాట పాదయాత్ర..

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. వైసిపి జాతీయ కార్యదర్శి రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ఈ నెల 20 న పాదయాత్ర కు సన్నాహాలు చేపడుతున్నారు. మంగళవారం విశాఖలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి లు మాట్లాడుతూ.. ఈ నెల 20 న జివిఎంసి గాంధీ విగ్రహం నుంచి కూర్మన్నపాలెం స్టీల్‌ ప్లాంట్‌ గేట్‌ వరకు 22 కిలోమీటర్లు పాదయాత్రను నిర్వహించనున్నామని తెలిపారు. అనంతరం సభ ఉంటుందని చెప్పారు. ఈ పాదయాత్రకు స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ పోరాట పాదయాత్ర గా నామకరణం చేసినట్లు విజయసాయిరెడ్డి ప్రకటించారు.