నూజివీడులో పార్టీనీ బలోపేతం చేయండి – నాదెండ్ల మనోహర్

నూజివీడులో జనసేన పార్టీనీ బలోపేతం చేయాలని జనసేన పార్టీ పి.ఏ.సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ కోరారు. గురువారం నూజివీడు నియోజకవర్గంలోని 4 మండల అధ్యక్షులు శ్రీ నాదెండ్ల మనోహర్ ను కలిసి పరిచయం చేసుకొని, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూజివీడు నియోజవర్గంలో ప్రజా సమస్యలపై పనిచేస్తూ పార్టీని బలోపేతం చేయడానికి మండలాధ్యక్షులు, జనసైనికులు కృషి చేయాలని కోరారు. శ్రీ నాదెండ్ల మనోహర్ ను కలిసిన వారిలో ఈ కార్యక్రమంలో నూజివీడు మండల అధ్యక్షులు ఎర్రంశెట్టి రాము, ఆగిరిపల్లి మండలం అధ్యక్షులు జలసూత్రం పవన్, ముసునూరు మండలం అధ్యక్షులు అబ్బూరి రవి కిరణ్, చాట్రాయి మండలం అధ్యక్షులు ఆరెల్లి కృష్ణ, నూజివీడు నియోజకవర్గం జనసేన నాయకులు మరీదు శివరామకృష్ణ, తుమ్మల జగన్, తుమ్మలపల్లి పాపారావు మరియు వలసపల్లి రామకృష్ణ ఉన్నారు.